Jarkhand Assembly Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన ఎంఎస్ ధోని

  • రాంచిలో భార్య సాక్షితో కలిసి ఓటేసిన మాజీ కెప్టెన్
  •  మూడో విడతలో మొత్తం 17 స్థానాల్లో కొనసాగిన పోలింగ్ 
  • 12 స్థానాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ పూర్తి

భారత క్రికెట్లో జార్ఖండ్ డైనమైట్ గా పేరుపొందిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు 17 నియోజకవర్గాల్లో మూడో విడత పోలింగ్ జరిగింది. ధోనీ తన భార్య సాక్షితో కలిసి రాంచిలోని ఓ పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేశారు. ఇది ఇలావుండగా, సాయంత్రం వరకు 57 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. 12 స్థానాల్లో ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకే పూర్తయింది. ఈ స్థానాల్లో 57.9 శాతం పోలింగ్ నమోదైంది.

More Telugu News