Ammarajyamlo kadaparedlu: పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది.. విజయవంతంగా నడుస్తుంది: చంద్రబాబును పోలిన పాత్రను పోషించిన ధనుంజయ ప్రభునే

  • ఈరోజు విడుదలైన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు
  • ఈ హాస్య చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడాలి
  • అయితే, రాజకీయ కోణంలో చూడొద్దన్న ధనుంజయ 

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం ఈరోజు విడుదలైంది. చంద్రబాబును పోలిన పాత్రను ఈ చిత్రంలో పోషించిన ధనుంజయ ప్రభునే హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో ధనుంజయ ప్రభునే మాట్లాడుతూ, పబ్లిక్ రెస్పాన్స్ బాగుందని, ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. ‘అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు’ హాస్య చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడాలని కోరిన ధనుంజయ, ఈ చిత్రాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని సూచించారు. కొత్త చిత్రాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తనకు నటించే అవకాశం వస్తే ఏ పాత్రలో అయినా నటిస్తానని చెప్పారు.

More Telugu News