DK Aruna: ఏపీ ప్రభుత్వ నిర్ణయం భేష్.. కేసీఆర్ కూడా ఈ విషయంపై ఆలోచించాలి: డీకే అరుణ

  • మద్య నిషేధం వైపు ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడం మంచి పరిణామం
  • తెలంగాణలో కూడా మద్య నిషేధానికి సమయం ఆసన్నమైంది
  • అత్యాచారాలకు మద్యమే కారణం

మద్య నిషేధం వైపు ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడం మంచి పరిణామమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రశంసించారు. తెలంగాణలో కూడా మద్యాన్ని నిషేధించేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించాలని సూచించారు.

దిశ, మానస, సమతలపై అత్యాచారాలకు మద్యమే కారణమని డీకే అరుణ అన్నారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బెల్టు షాపులు పెరిగిపోతున్నా కేసీఆర్ కు కనిపించడం లేదని విమర్శించారు. ఉద్యమం సమయంలో చెప్పిన మాటలను కేసీఆర్ మర్చిపోయారని అన్నారు. యువతను పెడదారి పట్టిస్తున్న పబ్ లు, క్లబ్ లను నిషేధించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

More Telugu News