Raghurama krishnam raju: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విందు.. హాజరైన కేంద్రమంత్రి రాజ్ నాథ్

  • సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో విందు
  • హాజరైన పలువురు మంత్రులు, ఎంపీలు
  • చివరి నిమిషంలో మారిన వేదిక

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిన్న రాత్రి ఢిల్లీలో నేతలకు విందు ఇచ్చారు. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఈ విందును ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ నేతలు మిథున్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

నిజానికి ఈ విందును కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, రఘురామకృష్ణంరాజు వియ్యంకుడు అయిన కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, కాంగ్రెస్ సభ్యుడి ఇంట్లో ఇచ్చే విందుకు కేంద్ర మంత్రులు వెళ్లడం బాగుండదన్న ఉద్దేశంతో చివరికి నూతన ఎంపీ తాత్కాలిక నివాసమైన వెస్ట్రన్ కోర్టులో ఏర్పాటు చేశారు. కాగా, ఈ విందుకు దాదాపు 300 మందిని ఆహ్వానించినట్టు వార్తలు వచ్చినా కొందరు కేంద్ర మంత్రులు మాత్రమే వచ్చినట్టు సమాచారం.

More Telugu News