Toss: ఈసారి కూడా టాస్ విండీస్ దే... భారత్ కు బ్యాటింగ్

  • భారత్, విండీస్ మధ్య మూడో టి20
  • ముంబయి వాంఖెడే మైదానంలో మ్యాచ్
  • మూడు టి20ల సిరీస్ లో చెరో మ్యాచ్ గెలిచిన భారత్, విండీస్

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో టి20 మ్యాచ్ లో ఛేజింగ్ చేసి గెలవడమే అందుకు కారణం. పైగా, వాంఖెడే మైదానం బ్యాటింగ్ కు అనుకూలమని పేరుంది. ఇక టీమిండియాలో ఈసారి మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లను తుదిజట్టులోకి తీసుకువచ్చారు. జడేజా, చహల్ లను తప్పించారు. వెస్టిండీస్ మేనేజ్ మెంట్ మాత్రం రెండో టి20 ఆడిన జట్టునే బరిలో దించుతోంది. మూడు టి20ల ఈ సిరీస్ లో టీమిండియా, విండీస్ చెరో మ్యాచ్ గెలిచి ఉండడంతో, ఈ చివరి టి20 సిరీస్ నిర్ణాయక మ్యాచ్ అయింది.

More Telugu News