Thulasi Reddy: పొద్దు పోక, నిద్ర రాక సమావేశాలు జరుపుతున్నట్టుంది: తులసిరెడ్డి

  • అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు సరిగా లేదు
  • కేసీఆర్ కు జగన్ హ్యాట్సాఫ్ చెప్పడం మంచిదే
  • ముందు మన రాష్ట్రం గురించి చెప్పాలి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు సరిగా లేదని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా సమావేశాలు కొనసాగడం లేదని అన్నారు. పొద్దు పోక, నిద్ర రాక సమావేశాలను జరుపుతున్నట్టుగా ఉందని చెప్పారు. ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్ కు జగన్ హ్యాట్సాఫ్ చెప్పడం మంచిదేనని, అయితే, ముందు మన రాష్ట్రం సంగతి చూడాలని, ఆ తర్వాత పక్క రాష్ట్రం గురించి చెప్పాలని సూచించారు. వైయస్ వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

More Telugu News