Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. భార్యకు ఉరేసి, కుమారుడికి ఊపిరాడకుండా చేసి హత్య చేసిన కసాయి

  • గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో ఘటన
  • భార్యాకుమారుడిని చంపి ఆత్మహత్యాయత్నం
  • నిందితుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో భార్య, కుమారుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మొదట భార్యను ఉరి వేసి చంపిన ఆ కసాయి, అనంతరం తన కుమారుడికి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి కుమారుడి వయసు ఏడాదిన్నర ఉంటుందని వివరించారు. ఆ వ్యక్తి ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయం గురించి తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News