Venkatesh: 'వెంకీమామ'లో మెరవనున్న సమంత

  • కేఎస్ రవీంద్ర దర్శకుడిగా 'వెంకీమామ'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు 
  •  ఈ నెల 13వ తేదీన విడుదల

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో 'వెంకీమామ' సినిమా రూపొందింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో, వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటించారు. ఈ సినిమాలో సమంత మెరవనుందనేది తాజా సమాచారం.

ఈ సినిమాలో అతిథి పాత్రలో సమంత కనిపించనుందని అంటున్నారు. కథలో అతిథి పాత్ర కీలకం కావడం వలన, సమంత అయితే కథా పరంగాను .. క్రేజ్ పరంగాను కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారట. అయితే కావాలనే ఈ విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా వుంచారట. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ వార్తను బయటికి వదిలినట్టుగా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News