Sakshi paper: ‘సాక్షి’ దొంగ పేపర్ అని జగనే స్వయంగా ప్రకటించారు: నారా లోకేశ్

  • ‘మాట మార్చుడు..’ అంటూ లోకేశ్ విమర్శలు
  • సాక్షి పేపర్ లో రాసేవన్నీ అబద్ధాలే
  • ఈ విషయాన్ని జగనే స్వయంగా ప్రకటించారన్న లోకేశ్

సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శల ట్వీట్లు కొనసాగుతున్నాయి. వంద శాతం సన్నబియ్యం క్వాలిటీ తో ఉన్న బియ్యమే పేదలకు ఇస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్ హామీ ఇవ్వడాన్ని, సన్న బియ్యం ఇస్తామని తమ మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదంటూ అసెంబ్లీలో ఆయన ప్రస్తావించడాన్ని లోకేశ్ గుర్తుచేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని జగన్ మాట మార్చారని, మడమ తిప్పారని విమర్శించారు. ఇదే వీడియోలో ‘సాక్షి పేపర్ లో తప్పు రాశారు అధ్యక్షా’ అంటూ అసెంబ్లీ సమావేశంలో జగన్ మాట్లాడటం కనబడుతుంది.

More Telugu News