Rajya Sabha: రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కు సుగంధ ద్రవ్యాల బోర్డులో స్థానం

  • సుగంధ ద్రవ్యాల బోర్డుకు ఎన్నికలు
  • రాజ్యసభ నుంచి ఎన్నికైన జీవీఎల్
  • బోర్డు సభ్యుడిగా మూడేళ్లపాటు కొనసాగనున్న జీవీఎల్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డులో సభ్యుడిగా ఎన్నుకున్నారు. జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు (స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కార్యవర్గానికి ఇవాళ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రాజ్యసభ నుంచి జీవీఎల్ ఎన్నికయ్యారు. ఈ పదవిలో జీవీఎల్ మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ బోర్డులో లోక్ సభ నుంచి ఇద్దరు ఎంపీలు, రాజ్యసభ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.

More Telugu News