Mahesh Babu: దూసుకుపోతున్న 'సరిలేరు నీకెవ్వరు' సాంగ్

  • దేవిశ్రీ స్వరకల్పనకు ఫ్యాన్స్ ఫిదా 
  • కొత్త రికార్డులను సృష్టిస్తున్న సాంగ్ 
  • వచ్చే సోమవారం మరో సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు'కి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా నుంచి ప్రతి సోమవారం ఒక లిరికల్ సాంగును వదలనున్నట్టు ముందుగానే చెప్పారు. అలాగే నిన్న ఈ సినిమా నుంచి 'సూర్యుడివో .. చంద్రుడివో' పాటను వదిలారు.

 ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట 24 గంటలు గడవకముందే రెండున్నర మిలియన్ల వ్యూస్ కి చేరువైంది. గతంలో మహేశ్ పేరుతో వున్న యూ ట్యూబ్ రికార్డులను ఈ పాట అధిగమించేలానే ఉందని అంటున్నారు. కథాకథనాలపరంగానే కాకుండా, ఇతర విశేషాల పరంగా కూడా ఈ సినిమా అనేక ప్రత్యేకతలను కలిగి ఉండటంతో, అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

More Telugu News