Chittoor District: చిత్తూరు జిల్లాలో బాలికపై అత్యాచారం!

  • వి.కోట మండలంలోని పెద్దబరినేపల్లిలో ఘటన
  • బాలికపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

చిత్తూరు జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగింది. వి.కోట మండలంలోని పెద్దబరినేపల్లిలో బాలికపై ఆటో డ్రైవర్ రాధాకృష్ణ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డ యువకులు

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో కూడా దారుణం జరిగింది. పాలకుర్తి మండలంలోని గుంటూరుపల్లిలో ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News