Apsrtc: ఆర్టీసీ ఛార్జీలు బాదుడే... బాదుడు: జగన్ పై నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు

  • ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నారా లోకేశ్ నిరసన
  • నాడు ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగం వీడియో పోస్ట్
  • ‘బాదుడే బాదుడు’ అంటూ అప్పటి సర్కార్ పై జగన్ విమర్శలు

ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై జగన్ ని విమర్శిస్తూ నారా లోకేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. నాడు ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ ప్రసంగించడం ఈ వీడియోలో కనబడుతుంది. ‘ఈ ఐదేళ్ల కాలంలో మనం చూశాం కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు.. ఆర్టీసీ ఛార్జీలు  బాదుడే బాదుడు..’ అంటూ జగన్ అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ విషయాన్ని లోకేశ్ ప్రస్తావించారు.

కాగా, నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు పది పైసలు, మిగతా బస్సుల్లో ఇరవై పైసలు పెరగనున్నట్టు వైసీపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

More Telugu News