Amma rajyamlo kadapa Biddalu: మార్ఫింగ్ ఫొటో ఎఫెక్ట్.. రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు కేఏ పాల్ కోడలు ఫిర్యాదు

  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి దిగిన ఫొటో మార్ఫింగ్
  • వర్మపై చర్యలు తీసుకోవాలి.. మార్ఫింగ్ ఫొటోను తొలగించాలి
  • సైబర్ క్రైమ్ పోలీసులకు పాల్ కోడలు జ్యోతి ఫిర్యాదు

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ను కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అందుకుంటున్నట్టుగా ఓ మార్ఫింగ్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం ప్రమోషన్ లో భాగంగా మార్ఫింగ్ చేసిన ఈ ఫొటోను వర్మ వాడుకున్నారని ఆరోపిస్తూ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి తాము దిగిన ఓ ఫొటోను మార్ఫింగ్ చేసి, వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా మార్చారని పేర్కొన్నారు. వర్మ తన ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోను తొలగించాలని, వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వర్మపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫొటో మార్ఫింగ్ చేసి పోస్టు చేసిన వర్మ ఐపీ నెంబర్ కోసం గూగుల్ సంస్థకు పోలీసులు లేఖ రాసినట్టు సమాచారం.

More Telugu News