Nirbhaya: ఢిల్లీలో నిర్భయ తల్లికి పూనమ్ కౌర్ విందు

  • ఢిల్లీ వెళ్లిన పూనమ్ కౌర్
  • నిర్భయ తల్లి ఆశాదేవితో భేటీ
  • నిందితులను ఉరితీసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నానని కామెంట్

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సినీ నటి పూనమ్ కౌర్ సామాజిక అంశాలపై తనదైన శైలింలో గళం వినిపిస్తుంటారు. తాజాగా ఆమె ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవిని కలుసుకున్నారు. ఏడేళ్ల కిందట దారుణమైన రీతిలో కడతేరిపోయిన నిర్భయ అంశం దిశ ఘటన కారణంగా మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ ఢిల్లీలో నిర్భయ మాతృమూర్తి ఆశాదేవిని కలుసుకోవడమే కాదు, ఆమెకు ఓ రెస్టారెంట్ లో విందు ఇచ్చారు. నిందితులను ఉరి తీసే క్షణాలను తాను కూడా ఆస్వాదిస్తానని, అందుకే నిర్భయ తల్లితో కలిసి వేడుక జరుపుకుంటున్నానని తెలిపారు.

More Telugu News