Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 42 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 15 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2 శాతానికి పైగా లాభపడ్డ యాక్సిస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో 40,487కి చేరుకుంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 11,937 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (2.01%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.98%), మారుతి సుజుకి (1.94%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.12%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.94%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-3.05%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.54%), ఎల్ అండ్ టీ (-1.26%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.01%), ఐటీసీ (-0.95%).

More Telugu News