Vijayawada: విజయవాడలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ప్రారంభం.. స్టేడియంలోకి పాము రావడంతో కాసేపు అంతరాయం

  • ఆంధ్ర - విదర్భ జట్ల మధ్య మ్యాచ్‌
  • పామును బయటకు పంపిన సిబ్బంది
  • తిరిగి మ్యాచ్ ప్రారంభం

విజయవాడలో సోమవారం ఉదయం  రంజీ ట్రోఫీ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోకి ఓ పాము వచ్చి మైదానంలో తిరిగింది. దీంతో  మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. ఆ పామును సిబ్బంది స్టేడియం నుంచి బయటకు పంపారు. దీంతో తిరిగి అంపైర్లు మ్యాచ్‌ను ప్రారంభించారు.

స్టేడియంలో పాము ప్రత్యక్షమైన దృశ్యాలను 'బీసీసీఐ డొమెస్టిక్‌' తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేసింది.  ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ డొమెస్టిక్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ రోజు గ్రూప్‌-ఏలో భాగంగా ఆంధ్ర - విదర్భ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచిన విదర్భ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది.

More Telugu News