DSC notification: వచ్చే నెలలో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

  • అసెంబ్లీలో ప్రకటించిన ఏపీ విద్యాశాఖ మంత్రి
  • సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానం
  • 7,900 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు వెల్లడి

నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చేనెలలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో 7,900 ఖాళీలతో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎప్పటి నుంచో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్త.

More Telugu News