Ongole: ఒంగోలు వద్ద హతులైన తల్లీకూతుళ్లు అమలాపురం వాసులుగా అనుమానం!

  • ఐదు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో హత్య!
  • మృతురాలు ఎవరో తెలియని వైనం
  • ఏపీలో అన్ని మిస్సింగ్ కేసులు పరిశీలించిన పోలీసులు

ఇటీవల ప్రకాశం జిల్లాలో ఓ యువతి, పసికందు సగం కాలిన స్థితిలో కనిపించడం సంచలనం సృష్టించింది. వారెవరో తెలియకపోవడం, జరిగిన ఘటన అత్యంత దారుణంగా ఉండడం ప్రకాశం జిల్లా పోలీసులకు సవాలుగా మారింది. హత్య జరిగి ఐదు రోజులైనా మిస్టరీ వీడలేదు. దాంతో ఎస్పీ సిద్ధార్థ కౌల్ ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఏపీలో నమోదైన అన్ని మిస్సింగ్ కేసులను సేకరించి విశ్లేషించారు. అమలాపురంకు చెందిన భవానీ అనే యువతి, తన 8 నెలల బిడ్డతో గత నెల 22న అదృశ్యమైన కేసు ప్రకాశం జిల్లా పోలీసుల దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఒంగోలు వద్ద హత్యకు గురైంది భవానీయేనని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అమలాపురం నుంచి భవానీ కుటుంబసభ్యులను పోలీసులు ఒంగోలు తీసుకువస్తున్నారు.

More Telugu News