India: బంతిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుడిన శివమ్ దూబే... భారీ స్కోరు దిశగా టీమిండియా

  • తిరువనంతపురంలో రెండో టి20
  • టాస్ గెలిచిన వెస్టిండీస్
  • టీమిండియా బ్యాటింగ్

తిరువనంతపురంలో వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో టీమిండియా యువ ఆటగాడు శివమ్ దూబే తన భుజ బలాన్ని ప్రదర్శించాడు. కేవలం 30 బంతుల్లోనే చకచకా 54 పరుగులు సాధించాడు. దూబే స్కోరు 3 ఫోర్లు, 4 భారీ సిక్సులున్నాయి. రన్ తీసే సమయంలో అడ్డొచ్చినందుకు తనను కొరకొరా చూసిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ ను అదే ఓవర్లో రెండు భారీ సిక్సులు బాదాడు. అదే ఊపులో వాల్ష్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 12 ఓవర్లలో 3 వికెట్లకు 112 పరుగులు. క్రీజులో కెప్టెన్ కోహ్లీ, రిషబ్ పంత్ ఉన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News