Tirupathi: తిరుపతిలో దారుణం. బాలికపై అత్యాచారం!

  • ముళ్లపూడి గ్రామానికి చెందిన బాలికపై అఘాయిత్యం
  • లిఫ్ట్ ఇస్తామంటూ దారుణానికి పాల్పడ్డ వైనం
  • బాలికను నమ్మించి బైక్ పై తీసుకెళ్లిన యువకులు

తిరుపతికి సమీపంలో బాలికపై అత్యాచారం జరిగింది. రూరల్ మండలం ముళ్లపూడి గ్రామానికి చెందిన ఓ బాలికకు లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మించి ఇద్దరు యువకులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారు.

గత నెల 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు తిరుచానూరు పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులు రాజమోహన్, వెంకటేశ్ ను అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిందితుల్లో ఒకరు రౌడీషీటర్ కాగా, గతంలో ఒక మర్డర్ కేసులో అతని పేరు ఉంది.

More Telugu News