Pawan Kalyan: రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం

  • తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న పవన్
  • రైతులతో సమావేశం
  • అనంతరం జనసేన నేతలతో భేటీ

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు రాజమండ్రి విమానాశ్రయంలో ఆ పార్టీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మోరంపూడి, వేమగిరి, కడియం సావరం, జేగురుపాడు మీదుగా ఆయన వెలగతోడుకు వెళ్లనున్నారు.

రైతులతో సమావేశమై వారి కష్టాలను తెలుసుకోనున్నారు. అనంతరం ఇప్పనపాడు, తాపేశ్వరం మీదుగా మండపేట చేరుకొని అక్కడి రైతులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అమలాపురం జనసేన నేతలతో ఆయన భేటీ అవుతారు.

More Telugu News