Disha: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నటుడు ఉపేంద్ర సంచలన వ్యాఖ్యలు.. దుమారం రేపుతున్న ట్వీట్

  • నిందితులే దోషులని చెప్పడానికి ఆధారాలు లేవు
  • ఎవరైనా ప్రముఖుల హస్తం ఉందేమోనని అనుమానం
  • ప్రముఖ వ్యక్తుల కేసుల్లో ఎన్‌కౌంటర్లు ఎందుకు జరగడం లేదు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కన్నడ నటుడు ఉపేంద్ర చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. దిశ హత్యాచార ఘటన వెనక ఎవరైనా ప్రముఖుల హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ ఉపేంద్ర ట్వీట్ చేశాడు. నిజంగా నిందితులే ఆ ఘాతుకానికి పాల్పడినట్టు ఆధారాలు లేవన్నాడు.

ప్రముఖ వ్యక్తుల కేసుల్లో ఇలాంటి ఎన్‌కౌంటర్లు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించాడు. కోర్టులో విచారణకు ముందే ఎన్‌కౌంటర్ చేయడం సరికాదన్నాడు. అప్పట్లో రౌడీయిజాన్ని తగ్గించే ఉద్దేశంతో ఎన్‌కౌంటర్లు జరిగేవని ఉపేంద్ర గుర్తు చేశాడు. నిజాయతీ కలిగిన పోలీసు అధికారులు మనసు పెడితే ఎన్‌కౌంటర్ ద్వారా అత్యాచారాలను నివారించవచ్చన్నాడు. దీనిని ప్రముఖులు, శ్రీమంతులు దుర్వినియోగం చేయకుండా చూడాలని హెచ్చరించారు.

కాగా, ఉపేంద్ర ట్వీట్‌పై దుమారం రేగుతోంది. కొందరు ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తుండగా, మరికొందరు విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీని పెట్టిన నటుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలుకుతున్నారు.

More Telugu News