srisailam: ఆత్మకూరు ఘాట్‌లో తప్పిన పెను ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

  • ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు
  • నలుగురికి గాయాలు
  • శ్రీశైలం నుంచి ఎమ్మిగనూరు వెళ్తుండగా ఘటన

కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గత రాత్రి ఆత్మకూరు ఘాట్‌లో ప్రమాదానికి గురైంది. బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని అత్యవసర చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News