Beeda Masthan Rao: జగన్ విధానాలు నచ్చడంతో వైసీపీలో చేరా: బీద మస్తాన్ రావు

  • ఏ పార్టీలో ఉన్నప్పటికీ అంకిత భావంతో పనిచేస్తా
  • వ్యక్తిగతంగా నాకు శత్రువులు లేరు
  • పార్టీలకతీతంగా నా ప్రాంత అభివృద్ధికి పాటుపడతా

జగన్ విధానాలు నచ్చడం వల్లే వైసీపీ లోకి వచ్చానని బీద మస్తాన్ రావు అన్నారు. టీడీపీ సీనియర్ నేత మస్తాన్ రావు నిన్న పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్ విధానాలు నచ్చే వైసీపీలో చేరినట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను నెరవేర్చే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ అంకిత భావంతో పనిచేసే మనిషినని చెప్పుకొచ్చారు. ఓ కార్యకర్తగా భేషరతుగా వైసీపీలో చేరినట్లు వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా శత్రువులు లేరన్నారు. పార్టీలకు అతీతంగా తన ప్రాంత అభివృద్ధికి పాటుపడతానన్నారు.

More Telugu News