Uppal: ఉప్పల్ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా

  • మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
  • ఇరుజట్లలోనూ ఆసక్తికర ఆటగాళ్లు

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగే తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచింది. ఇక్కడ ఛేదన అనుకూలంగా ఉంటుందన్న నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మర సాధన చేశాయి.

భారత్ ఈ మ్యాచ్ కోసం మెరుగైన జట్టుతో బరిలో దిగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, పంత్, జడేజా వంటి కీలక ఆటగాళ్లు విండీస్ పై రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్, శివమ్ దూబే వంటి హార్డ్ హిట్టర్లు కూడా ఉన్నారు.

ఇక విండీస్ జట్టు ఈ మ్యాచ్ లో భారత్ ను నిలువరించాలని ప్రణాళికలు రచించింది. లూయిస్, హెట్మెయర్ వంటి యువ ప్రతిభావంతులతో పాటు కెప్టెన్ పొలార్డ్, లెండిల్ సిమ్మన్స్ వంటి సీనియర్లతో కరీబియన్ జట్టు కూడా బలంగానే ఉంది.

More Telugu News