cm: మృతి చెందిన టీఎస్సార్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత

  • జీహెచ్ఎంసీ పరిధిలోని 10 కుటుంబాలకు న్యాయం
  • ముఖ్యమంత్రి మాట మేరకు నియామకాలు
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం కూడా

ఇటీవల జరిగిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె సందర్భంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మృతి చెందిన 10 మంది కార్మికుల కుటుంబాలలో ఒక్కొక్కరి చొప్పున ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

సమ్మె విరమణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి మాట ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి కానిస్టేబుల్, ఒకరికి కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి మాట ఇచ్చారు.

More Telugu News