Police: నిందితులు రాళ్లు రువ్వగా ఇద్దరు పోలీసులకూ గాయాలు... ఆసుపత్రిలో చికిత్స!

  • పోలీసులపై దాడికి దిగిన నిందితులు
  • లొంగిపోవాలన్న హెచ్చరికలు బేఖాతరు
  • తుపాకి కాల్పుల్లో నలుగురూ మృతి

ఈ ఉదయం దిశ హంతకులను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లిన సమయంలో వారు పోలీసులపై దాడికి దిగి పారిపోతుంటే, ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలీసులకూ గాయాలు అయ్యాయి. దిశను కాల్చిన చోటు నుంచి పరుగు ప్రారంభించిన నలుగురు నిందితులూ, అక్కడి దొరికిన రాళ్లను పోలీసులపైకి విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

వారు విసిరిన రాళ్లలో కొన్ని పోలీసులకూ తగిలాయని, గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను వారు పట్టించుకోనందుకే ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందన్నారు.

More Telugu News