samanta: భయానికి సమాధానం దొరికింది: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సమంత

  • తెలంగాణ పోలీసులకు సెల్యూట్
  • అప్పుడప్పుడు ఇదే పరిష్కారం
  • ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి చేకూరుతుంది

దిశ హత్యాచార కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సినీ నటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులకు సెల్యూట్ అని హీరోయిన్ సమంత ట్వీట్ చేశారు. 'భయానికి సరైన సమాధానం దొరికింది. అప్పుడప్పుడు ఇదే పరిష్కారం' అని ఆమె అన్నారు.

'ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇటువంటి ఘోర ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి మంచి బుద్ధులు నేర్పించాలి. జైహింద్' అని రవితేజ పేర్కొన్నారు.     నిందితులను చంపేయడమే ఇటువంటి సమస్యలకు పరిష్కారమంటూ సినీనటులు ట్వీట్లు చేస్తున్నారు.

More Telugu News