Prakash Reddy: ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే...: డీసీపీ ప్రకాశ్ రెడ్డి

  • నిందితులను హతమార్చాలని భావించలేదు
  • వారు కాల్పులు ప్రారంభిస్తేనే పోలీసులు కాల్చారు
  • తప్పనిసరైన పరిస్థితుల్లోనే ఎన్ కౌంటర్

దిశ హత్య కేసు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఆ పరిస్థితుల్లో తప్పనిసరై తాము ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ తెల్లవారుజామున సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనా స్థలికి తీసుకుని వచ్చినట్టు తెలిపారు. ఆ సమయంలో నిందితులు పోలీసుల ఆయుధాలను లాక్కున్నారని, ఆ వెంటనే ఫైరింగ్ ను ఓ పెన్ చేశారని తెలిపారు. ఆత్మ రక్షణార్థం జరిపిన కాల్పుల్లో వారు మరణించారని, తామేమీ ఎన్ కౌంటర్ చేసి వారిని హతమార్చాలన్న ఆలోచనలో లేమని స్పష్టం చేశారు.

More Telugu News