Chatanpalli: ఎన్ కౌంటర్ ప్రదేశం మీదుగా బస్సులో వెళుతూ... కాలేజీ అమ్మాయిల కేరింతలు... వీడియో ఇదిగో!

  • నలుగురు నిందితుల ఎన్ కౌంటర్
  • పోలీసుల చర్యను సమర్ధిస్తున్న ప్రజలు
  • తమలోని ఆనందాన్ని వ్యక్తం చేసిన అమ్మాయిలు

అది శంషాబాద్ కు సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఉన్న చటాన్ పల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్. అక్కడే దిశను దారుణాతి దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. ఈ ఘటన జరిగి సరిగ్గా నేటికి 10 రోజులు. నలుగురు నిందితులూ ఈ ఉదయం ఎన్ కౌంటర్ లో హతులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వారంతా పోలీసుల చర్యను సమర్ధిస్తున్నారు.

ఇక ఎన్ కౌంటర్ ప్రాంతం జనసంద్రంగా మారింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్న వేళ, ఓ కాలేజీకి వెళుతున్న అమ్మాయిల బస్సులో నుంచి వినిపిస్తున్న కేరింతల వీడియో వైరల్ అవుతోంది. ఎన్ కౌంటర్ లో దిశను చంపేసిన వారంతా మరణించారని తెలుసుకున్న అమ్మాయిలు, తమలోని ఆనందాన్ని కేకలు, కేరింతలతో బయటకు చూపించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News