Guntur District: నరసరావుపేట ఎంపీ ఇంటిపై దుండగుల దాడి

  • ధ్వంసమైన అద్దాలు
  • వెంటనే ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా వాచ్ మెన్ కు వార్నింగ్
  • విచారణ ప్రారంభించిన పోలీసులు

గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో నరసరావుపేటలోని ఆయన నివాసం అద్దాలు ధ్వంసం అయ్యాయి. దాడి చేసిన అనంతరం వెంటనే ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా దుండగులు వాచ్ మెన్ ను బెదిరించి పరారయ్యారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అనంతరం పోలీసులు ఎంపీ ఇంటికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దుండగులకు సంబంధించిన వివరాలను వాచ్ మెన్ ను అడిగి తెలుసుకున్నారు.

More Telugu News