Jagan: కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరుతున్న జగన్

  • రేపు మోదీని కలవనున్న జగన్
  • ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆహ్వానించనున్న సీఎం
  • అమిత్ షాను కలిసే అవకాశం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరుతున్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయల్దేరుతున్నారు. రేపు ప్రధాని మోదీతో జగన్ సమావేశం కాబోతున్నారు. ఈ నెల 23న కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరగనుండగా, జనవరి 9న అమ్మఒడి పథకం ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమాలకు మోదీని జగన్ ఆహ్వానించబోతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా జగన్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News