Disha: దిశ ఘటనపై కేసీఆర్ స్పందించట్లేదు.. మద్యపాన నిషేధంపై నిరాహార దీక్షకు దిగుతున్నాను: డీకే అరుణ

  • మద్యం వల్లే రాష్ట్రంలో ఘోరాలు
  • మద్యం, మాదక ద్రవ్యాలను నియంత్రించాలి
  • ఈ నెల 11, 12 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద మహిళా సంకల్ప దీక్ష

దిశ ఘటన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. దిశ దారుణ ఘటనపై దేశమంతా స్పందించినా కేసీఆర్ మాత్రం స్పందించట్లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం వల్లే రాష్ట్రంలో ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో మద్యం, మాదక ద్రవ్యాలను నియంత్రించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధంపై రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానన్నాను. ఈ నెల 11, 12 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద మహిళా సంకల్ప దీక్ష పేరుతో నిర్వహిస్తోన్న ఈ దీక్షకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని కోరుతున్నానని అన్నారు.

More Telugu News