Uttar Pradesh: యూపీలో దిశ తరహా ఘటన.. యువతిపై అత్యాచారం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం

  • 70 శాతం గాయాలపాలైన యువతి
  • లక్నోలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
  • ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో 'దిశ' తరహా ఘటన చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ముగ్గురు నిందితులు హత్యాయత్నం చేశారు. దీంతో ఆమె 70 శాతం గాయాలతో లక్నోలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఆమెపై కొందరు మృగాళ్లు గతంలో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. వారిపై బాధితురాలు కేసు పెట్టడంతో ఆమెపై హత్యాయత్నం చేశారని చెప్పారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

More Telugu News