BJP: పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: జీవీఎల్ డిమాండ్

  • మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమనడం తగదు
  • ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది
  • భవిష్యత్ లో ఇటువంటి తప్పు చేయనని ప్రజలకు భరోసా ఇవ్వాలి

దేశంలో మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమని, ఏ గొడవలు జరిగినా దానికి హిందూ నాయకులే కారణమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యల వెనుక తప్పకుండా రాజకీయ దురుద్దేశం ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. పవన్ తన తప్పుడు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, భవిష్యత్ లో ఇటువంటి తప్పు చేయనని ప్రజలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News