Telangana: 'దిశ' నిందితుడు మహ్మద్ పై వ్యాఖ్యలు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

  • దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలన్న రాజాసింగ్
  • మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
  • బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీస్ కేసు నమోదైంది. దిశ అత్యాచారం కేసులో మహ్మద్ ను ఉరితీయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక మతాన్ని అవమానించేలా ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. తమ మతాన్ని కించపరిచారని ఆరోపిస్తూ బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో మహమ్మద్ నవాజుద్దీన్ అనే వ్యక్తి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. 295ఏ సెక్షన్ కింద రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, దిశ కేసు నిందితుల్లో ఒకరైన మహ్మద్ ఆరిఫ్ ను ఉద్దేశించి రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News