Stock Market: లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

  • 175 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 43 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 7 శాతానికి పైగా పెరిగిన టాటా మోటార్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాటను పట్టాయి. మెటల్, బ్యాంకింగ్, ఐటీ స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి.  ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 175 పాయింట్లు పెరిగి 40,850కి చేరింది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 12,037కు పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (7.18%), యస్ బ్యాంక్ (5.88%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.82%), వేదాంత లిమిటెడ్ (3.08%), టాటా స్టీల్ (2.67%).

టాప్ లూజర్స్:  
ఎల్ అండ్ టీ (2.23%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.61%), మారుతి సుజుకి (0.89%), ఏసియన్ పెయింట్స్ (0.87%), బజాజ్ ఆటో (0.56%).

More Telugu News