Crime News: విశాఖ మధురవాడలో వార్డు వలంటీర్ పై కత్తితో దాడి.. తీవ్రగాయాలు

  • ఇంటికి సర్వేకు రాలేదని వ్యక్తి ఆగ్రహం 
  • పొట్టలో రెండుసార్లు పొడిచిన వైనం
  • కేజీహెచ్ లో ప్రాణాలతో పోరాడుతున్న బాధితుడు

తన ఇంటికి వచ్చి సర్వే చేయలేదన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి వార్డు వలంటీర్ పై హత్యా యత్నం చేశాడు. కత్తితో దాడిచేసి పొట్టలో రెండుసార్లు పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే...విశాఖ నగరం మధురవాడ పరిధిలోని కె-1 కాలనీ వార్డు వలంటీర్‌గా లాల్ బహుదూరాయ్ నియమితుడయ్యాడు. ఇటీవల ప్రభుత్వం తెల్ల కార్డును పలు రకాల కార్డులుగా విభజించి వేర్వేరు కార్డుల జారీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో వార్డు వలంటీర్లు గత నెల 20వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు సర్వే నిర్వహించారు.

ఈ మేరకు బియ్యం, ఫీజు రీయంబర్స్ మెంట్, పింఛన్లు, ఆరోగ్యశ్రీ తదితరాలకు సంబంధించి వేర్వేరు జాబితా తయారు చేస్తారు. అయితే ఈ సర్వేకోసం తన ఇంటికి రాలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి వలంటీర్ పై ఈ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు బాధితుడిని కేజీహెచ్ కి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాలతో పోరాడుతున్నాడని సమాచారం.

More Telugu News