Savitri: సావిత్రి కారణంగా జయంతి ఏడుస్తూ సెట్లో నుంచి వెళ్లిపోయిందట!

  • అప్పట్లో జయంతికి తమిళం రాదు 
  • సావిత్రి విసుక్కోవడానికి కారణం అదే 
  • ఆ తరువాత సావిత్రి బాధపడ్డారన్న ఈశ్వర్ 

సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ జయంతికి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చారు. "తెలుగు .. కన్నడ సినిమాలు ఎక్కువగా చేసే జయంతి, ఒకసారి ఒక తమిళ సినిమాలో సావిత్రిగారితో కలిసి నటించవలసి వచ్చింది. అయితే జయంతిగారికి తమిళం రాకపోవడం వలన, రెండు మూడు టేకులు తీసుకున్నారు. దాంతో 'డైలాగ్ చెప్పడం రాని ఆర్టిస్టులను తీసుకుని మా టైమ్ అంతా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అంటూ సావిత్రి విసుక్కున్నారట.

ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడుస్తూ సెట్లో నుంచి జయంతి వెళ్లిపోయారు. ఇది జరిగిన కొంతకాలానికి కన్నడలో జయంతితో కలిసి సావిత్రి నటించవలసి వచ్చిందట. సావిత్రి సెట్లోకి అడుగుపెట్టగానే జయంతి ఆమె కాళ్లకి నమస్కరించి, "ఆ రోజున నాకు తమిళం రాదని మీరు విసుక్కున్నారు. అప్పటి నుంచి నేను తమిళంపై దృష్టిపెట్టి నేర్చుకున్నాను" అంటూ చెప్పారట. అయితే గతంలో తను అలా చేసినందుకు ఆ క్షణం సావిత్రిగారు కూడా చాలా బాధపడ్డారట.

More Telugu News