Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ టెన్త్ పరీక్షల షెడ్యూల్ వివరాలు!

  • మార్చి 23 నుంచి మొదలు
  • ఏప్రిల్ 8 వరకూ పరీక్షలు
  • షెడ్యూల్ విడుదల చేసిన మంత్రులు సురేశ్, అనిల్ కుమార్

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకూ పరీక్షలు జరుగుతాయి. మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్ లు పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు.

మార్చి 23న ప్రథమ భాష పేపర్ -1 (గ్రూప్-ఏ, కాంపోజిట్ కోర్సు), 24న ప్రథమ భాష పేపర్ - 2 (గ్రూప్-ఏ, కాంపోజిట్ కోర్సు, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1), 26న ద్వితీయ భాష, 27న ఇంగ్లీష్ పేపర్ - 1, 28న ఇంగ్లీష్ పేపర్ - 2, 30న గణితం పేపర్ - 1, 31న గణితం పేపర్ - 2 పరీక్షలు జరుగుతాయి.

ఏప్రిల్ 1న జనరల్ సైన్స్ పేపర్ - 1, 3న జనరల్ సైన్స్ పేపర్ - 2, 4న సోషల్ స్టడీస్ పేపర్ - 1, 6న సోషల్ స్టడీస్ పేపర్ - 2, 7న ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ - 2, 8న ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ జరుగుతాయి. ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్ష మాత్రం ఉదయం 11.30 గంటల వరకూ జరుగుతుంది.

More Telugu News