Telangana: తెలంగాణ పాఠశాలల్లో విద్యార్థినులకు మూడు నెలల పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ

  • దిశ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు
  • డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో శిక్షణ
  • ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ

దిశ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే చర్యలకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు 3 నెలల పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించనున్నారు. కరాటే, జూడో పోరాట విద్యల్లో తర్ఫీదు ఇవ్వాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

More Telugu News