Nikhil: సుకుమార్ సిద్ధం చేసిన కథ .. హీరోగా నిఖిల్

  • 'అర్జున్ సురవరం'తో తాజా హిట్ 
  • గీతా ఆర్ట్స్ 2'లో కొత్త సినిమా
  • దర్శకుడిగా సూర్యప్రతాప్   

నిఖిల్ తాజా చిత్రంగా వచ్చిన 'అర్జున్ సురవరం' హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఆ ఉత్సాహంతో ఆయన తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 వారు నిఖిల్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమాకి సుకుమార్ కథ - స్క్రీన్ ప్లేను అందించడం విశేషం. అంతేకాదు బన్నీవాసుతో కలిసి సుకుమార్ ఈ సినిమాకి ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

సుకుమార్ శిష్యుడైన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు. గతంలో సుకుమార్ అందించిన కథతో సూర్యప్రతాప్ తెరకెక్కించిన 'కుమారి 21F' విజయవంతమైన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

More Telugu News