Crime News: తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. మహిళపై సామూహిక అత్యాచారం, హత్య!

  • ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో ఘటన
  • నిందితులుగా ముగ్గురు వ్యక్తులు
  • ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.  50 ఏళ్ల ఓ మహిళపై కొందరు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను నిందితులుగా అనుమానిస్తోన్న పోలీసులు వారిలో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు పాల్పడ్డ మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇటీవలే హైదరాబాద్ శివారులోని శంషాబాద్ కు చెందిన యువతి దిశ హత్యాచారం కేసులో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతోన్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరకవముందే ఏపీలో మరోసారి ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది.

More Telugu News