Anushka: 'నిశ్శబ్దం' అనుష్క కోసం రాసిన కథ కాదట!

  • విమానంలో అనుష్క కలిశారు 
  • ఆ సమయంలోనే 'నిశ్శబ్దం' కథ చెప్పాను 
  • అనుష్క కెరియర్లో నిలిచిపోతుందన్న కోన

అనుష్క ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'నిశ్శబ్దం' .. జనవరి 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.  హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క చిత్రకారిణిగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాను గురించి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ .. "నిజానికి ఈ కథ అనుష్కను దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు. కథ రాసుకున్న తరువాత ఓ స్టార్ హీరోయిన్ తో చేస్తే బాగుంటుందని అనుకున్నాను.

అలాంటి పరిస్థితుల్లోనే నేను ముంబై నుంచి హైదరాబాద్ విమాన ప్రయాణం చేస్తున్నాను. అనుకోకుండా అనుష్క కూడా అదే విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఆమెకి నేను ఈ కథను గురించి చెప్పాను. కొన్ని రోజుల తరువాత అనుష్క కాల్ చేసి ఆ సినిమా చేయడానికి తను అంగీకరిస్తున్నట్టు చెప్పారు. అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా తప్పకుండా చేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News