priyanka gandhi: మనం ఎటువంటి స‌మాజాన్ని సృష్టిస్తున్నాం?: రాబ‌ర్ట్ వాద్రా

  • ఇది నా కుటుంబానికి చెందిన భ‌ద్ర‌త విష‌యం కాదు
  • దేశ పౌరుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన విషయం
  • ముఖ్యంగా దేశంలోని మ‌హిళ‌లకు భద్రత కల్పించాలి

దేశ వ్యాప్తంగా భద్రత లేదంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు. 'ఇది ప్రియాంకా గాంధీ, నా కూతురు, కుమారుడు, గాంధీ కుటుంబానికి చెందిన భ‌ద్ర‌త విష‌యం కాదు. దేశ పౌరుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన విషయం. ముఖ్యంగా దేశంలోని మ‌హిళ‌లకు భద్రత కల్పించి, తాము సుర‌క్షితంగానే ఉంటామన్న భావనను వారిలో కలిగించాలి' అని ట్వీట్ చేశారు.

'దేశ‌వ్యాప్తంగా భద్రత లేదు. అమ్మాయిల‌పై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జ‌రుగుతున్నాయి. ఎటువంటి స‌మాజాన్ని మ‌నం సృష్టిస్తున్నాం? దేశంలోని ప్ర‌తి పౌరుడికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త. మ‌న దేశంలో, మ‌న ఇళ్లలో, రోడ్ల‌పై, ప‌గ‌లు, రాత్రి భద్రత లేదు. మనం ఎప్పుడు, ఎక్క‌డ క్షేమంగా ఉంటాం?' అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా, ఇటీవలే గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను ఎత్తివేసిన విష‌యం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ లోని శంషాబాద్ కు చెందిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీటిని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

More Telugu News