Congress: శిక్షలు వెంటనే అమలు చేయాలి: సుబ్బరామి రెడ్డి

  • ఇలా చేస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు: సుబ్బరామి రెడ్డి
  • ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి: అన్నాడీఎంకే
  • నలుగురు నిందితులకు డిసెంబరు 31లోగా ఉరి శిక్ష వేయాలి

ఆడపిల్లలపై దాడులకు పాల్పడిన ఘటనల్లో శిక్షలు వెంటనే అమలు చేయాలని రాజ్యసభలో ఎంపీ సుబ్బరామిరెడ్డి అన్నారు. దిశ ఘటనపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు వెంటనే అమలు చేస్తేనే, ఇటువంటి ఘటనలు పునరావృతం కావని ఆయన అభిప్రాయపడ్డారు.

తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ డిమాండ్ చేశారు. నలుగురు నిందితులకు డిసెంబరు 31లోగా ఉరి శిక్ష వేయాలని అన్నారు. శిక్షలు వెంటనే అమలు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

More Telugu News