amaravathi: హోదా మరుగున పడడానికి చంద్రబాబే కారణం: వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్

  • సమయం రాగానే హోదా గురించి అడుగుతాం
  • విశాఖ, రాజమహేంద్రవరం అభివృద్ధి
  • రాజధాని అక్కడే ఉంటుంది

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడిగేందుకు అవసరమైన సమయం రాగానే తప్పకుండా అడుగుతామని రాజమహేంద్రవరం వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. నిన్న రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా మరుగున పడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నవన్నీ అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు చెప్పారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీస్తున్నామన్నారు. రాజధాని విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదని, అది అక్కడే ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్టణం, రాజమహేంద్రవరం వంటి నగరాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు.  

More Telugu News