Karthi: 'దొంగ'గా రంగంలోకి దిగుతోన్న కార్తీ

  • 'ఖైదీ'తో హిట్ కొట్టిన కార్తీ
  • జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మరో ప్రయోగం  
  • ఈ నెల 20న 'దొంగ' విడుదల  

కార్తీ నుంచి ఇటీవల వచ్చిన 'ఖైదీ' తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. యాక్షన్ .. ఎమోషన్ తో మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా మొత్తం ఒకే ఒక డ్రెస్ లో కనిపించిన కార్తీకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి.

అలాంటి కార్తీ ఈ ఏడాదిలోనే మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు .. ఆ సినిమా పేరే 'దొంగ'. డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపించే ఈ సినిమాలో 'జ్యోతిక' ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. మలయాళంలో 'దృశ్యం' సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో కార్తీకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News