Rai Lakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • రాయ్ లక్ష్మి ద్విపాత్రాభినయం 
  • 'రీసౌండ్' చేస్తున్న సాయిరాం శంకర్ 
  • హిందీ సినిమాలో నర్రా శీను

   *  గ్లామర్ తార రాయ్ లక్ష్మి ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం 'సిండ్రెల్లా'. విను వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి అదే పేరుతో అనువదిస్తున్నారు.
*  పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కృష్ణ చిరుమామిళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు 'రీసౌండ్'. రాశి సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.  
*  తెలుగులో పలు సినిమాలలో నటిస్తున్న కారెక్టర్ యాక్టర్ నర్రా శీను తొలిసారిగా ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'రాధే' చిత్రంలో శీను ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. శీను తమిళంలో నటించిన 'ఖాకి' చిత్రంలోని నటనను చూసిన ప్రభుదేవా ఇప్పుడు 'రాధే' చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడట. 

More Telugu News